గోల్డ్కోస్ట్, ఏప్రిల్ 10 : ఆస్ట్రేలియాలో గోల్డ్కోస్ట్ వేదికగా జరుగుతున్నా 21వ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పురుషుల హాకీ జట్టు సెమీస్కు చేరింది. టీమిండియా హాకీ జట్టు మలేసియాపై విజయం సాధించి సెమీస్కు అర్హత సాధించింది. పూల్-బిలో భారత్ తొలి మ్యాచ్ను పాకిస్థాన్తో డ్రా చేసుకుంది. ఆ తర్వాత 4-3 తేడాతో వేల్స్ను మట్టికరిపించింది. ఈ రోజు మలేసియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది. తాజా విజయంతో భారత్ లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. భారత్ తన తదుపరి మ్యాచ్ ను ఇంగ్లాండ్తో తలపడనుంది. మరోవైపు భారత బాక్సర్ అమిత్ పంగల్ పురుషుల 49 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో సెమీస్ చేరి పతకం ఖాయం చేసుకున్నాడు. క్వార్టర్స్లో అమిత్ స్కాట్లాండ్ బాక్సర్ అహ్మద్పై 4-1 తేడాతో గెలుపొందాడు.