కామన్‌వెల్త్ గేమ్స్ : భారత్ ఖాతాలో మరో స్వర్ణం

SMTV Desk 2018-04-06 11:54:56  Commonwealth Games 2018, sanjitha chanu, weight lifting, goldcoast

గోల్డ్‌కోస్ట్, ఏప్రిల్ 6‌: అస్ట్రేలియాలోని క్వీన్ ల్యాండ్ రాష్ట్రం గోల్డ్ కోస్ట్ పట్టణంలో జరుగుతున్నా21వ కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ మరో స్వర్ణం సాధించింది. మహిళల 53 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన సంజిత చాను పసిడి పతకం దక్కించుకొంది. 53 కేజీల విభాగంలో లిఫ్టర్‌ సంజిత చాను 192 కేజీ బరువున స్వర్ణంను ముద్దాడింది. భారత్‌ ఇప్పటి వరకు గెలిచిన మూడు పతకాలు వెయిట్‌ లిఫ్టింగ్‌లోనే దక్కడం విశేషం. గురువారం జరిగిన మొదటి రోజు పోటీల్లో వెయిట్‌ లిఫ్టర్లు గురు రాజా(రజతం), మీరాబాయి చాను(స్వర్ణం) పతకాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.