కశ్మీర్‌ దాడులను ఖండిచాలి: ఫరుఖ్‌

SMTV Desk 2018-04-04 17:42:55  farooq abdullah, Mehbooba Mufti Sayeed, Encounters,Shahid Afridi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 : కశ్మీర్‌ లోయలో జరుగుతున్న కాల్పుల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ దుశ్చర్యను ప్రపంచ దేశాలు ఖండించాలని జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమత్రి ఫరుఖ్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. కాగా కశ్మీర్‌లో జరుగుతున్న దాడులపై ఐక్యరాజ్య సమితి స్పందించాలని పాక్‌ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదీ గతంలో పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలుకు మద్దతుగా ఫరుఖ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో పరిస్థితి మరింత దిగజారపోయిందని, శాంతి నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం పాక్‌తో చర్చలు ప్రారంభించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముప్తీ మహ్మాద్‌ భారత ప్రభుత్వాన్ని కోరిన విషయం విదితమే.