ముంబై, మార్చి 29 : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథిగా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని సన్రైజర్స్ సీఈవో కె.షణ్ముగం ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా డేవిడ్ వార్నర్ బుధవారం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ స్థానంలో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్కు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పగ్గాలు అప్పగించారు. ‘ఈ ఏడాది ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించనున్నాడు’ అని షణ్ముగం పేర్కొన్నాడు. దీనిపై విలియమ్సన్ మాట్లాడుతూ.."ఈ ఏడాది ఐపీఎల్ సన్రైజర్స్కు కెప్టెన్ బాధ్యతలు స్వీకరించాను. ఎంతో ప్రతిభ ఉన్న జట్టుకు బాధ్యతలు వహించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను" అని తెలిపాడు.