రాంచి, మార్చి 24: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు దాణా స్కామ్కు సంబంధించి నాలుగో కేసులో ఏడేళ్ల జైలుశిక్ష పడింది. ఈ కేసులో ఆయనను దోషిగా తేలుస్తూ రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గత సోమవారం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో నేడు న్యాయస్థానం ఆయనకు శిక్ష ఖరారు చేసింది. కాగా ఇప్పటికే మరో మూడు దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన లాలూ.. 13.5 ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్నారు. తాజాగా ఏడేళ్ల జైలు శిక్ష పడడంతో లాలూకి మొత్తం 20 సంవత్సరాలకు పైగా శిక్ష పడినట్టైంది. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని బిస్రా ముండా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.