చెన్నై, మార్చి 21: చెన్నై నగర రవాణా సంస్థ సీనియర్ సిటిజన్లకు బుధవారం నుంచి మూడు నెలల పాటు ఉచిత బస్ పాసు, టోకెన్లు అందించే సౌకర్యం కల్పిస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.నగరంలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్లు రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణించేందుకు ఉచిత బస్ పాసులు, టోకెన్లు కొత్తగా తీసుకునే వారికి మాత్రం ఆయా డిపోల్లో అన్ని పనిదినాల్లో అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కొత్తగా వీటికోసం దరఖాస్తు చేసుకునేవారికి బుధవారం నుంచి ఉచిత బస్ పాసులు, టోకెన్లు లభిస్తాయని తెలిపారు.