తెలుగులో ఉగాది విషెస్ తెలిపిన మోదీ..

SMTV Desk 2018-03-18 13:03:25  Narendra modi, ugadhi, wishes, in telugu

న్యూఢిల్లీ, మార్చి 18: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అంటూ తెలుగులోనే విషెస్ తెలిపారు. న్యూఢిల్లీలో ఉన్న ప్రధాని మోదీ, శ్రీశైలం ఆలయ ప్రధాన అర్చకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మిమ్మల్ని నేరుగా కలిసే అవకాశం లేనందున వీడియో కాన్ఫరెన్స్‌లో మీతో మాట్లాడుతున్నానని అర్చకులకు చెప్పారు. తెలుగువారికి ఉగాది ఎంతో పవిత్రమైన పండుగ అన్నారు. తీపి, చేదు కలయికతో కూడిన ఉగాది పచ్చడి మహా అద్భుతంగా ఉంటుంది. దేశ పవిత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటని బసమేశ్వరుడు నడయాడిన నేల కూడా శ్రీశైలం అని మోదీ అభివర్ణించారు. ఉగాది యుగానికి ఆరంభం. సంతోషం, బాధతో కూడిన జీవితాలను ఉగాది పచ్చడి ప్రతిభింబిస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.