కొలంబో, మార్చి 15 : టీమిండియా సారధి రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నిదహాస్ ట్రోఫీ లో భాగంగా హిట్ మ్యాన్ నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ 89 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇందులో 5 ఫోర్లు, 5 సిక్స్లు ఉన్నాయి. దీంతో అతడి మొత్తం సిక్సర్ల సంఖ్య 75కు చేరగా, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా బ్యాట్స్మన్గా రికార్డులోకెక్కాడు. ఇంతకుముందు అత్యధిక సిక్స్ ల రికార్డు యువరాజ్ సింగ్ (74 సిక్సర్లు) పేరిట ఉంది. రైనా (54), ధోని (46), కోహ్లి (41) వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్గా అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో క్రిస్ గేల్, గప్టిల్(103) సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.