న్యూఢిల్లీ, మార్చి 9 : రాజ్యసభ స్థానాలపై తెలుగుదేశం పార్టీలో ఉత్కంఠ నెలకొంది. రేపు, ఎల్లుండి సెలవులు రావడం, నామినేషన్ దాఖలుకు సోమవారమే చివరి రోజు కావడంతో ఎవరికి అవకాశం వస్తుందోనని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. రాజ్యసభ స్థానాలు ఎవరికి దక్కుతాయోనని తెదేపా లో ఉత్కంఠ మొదలయింది. ఆదివారం జరిగే పొలిట్బ్యూరో సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది.