న్యూఢిల్లీ, భారత స్టార్ బౌలర్ మహమ్మద్ షమిపై అతని భార్య హసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తకు వివాహేతర సంబంధాలున్నాయని దీంతో అతను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు హసిన్ మీడియాతో మాట్లాడుతూ.. "షమికి ఎంతో మందితో వివాహేతర సంబంధాలున్నాయి. గత రెండు సంవత్సరాల నుండి షమి, అతని కుటుంబ సభ్యులు నన్ను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. అంతేకాదు. నన్ను చంపడానికి సైతం వెనుకాడడం లేదు" అని వాపోయింది. ఓసారి అతని మొబైల్ చూశానని అన్ని అసభ్యకరమైన సందేశాలు కనిపించాయన్నారు. "పాకిస్థాన్కు చెందిన ఓ అమ్మాయితో షమికి పెళ్లి అయ్యింది. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ అనంతరం ఆ అమ్మాయి కోసం పాకిస్థాన్ కూడా వెళ్లాడు. కుల్దీప్ అనే వ్యక్తి.. షమికి అమ్మాయిలను సప్లై చేస్తాడు. ఈ విషయం బీసీసీఐకి తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. షమితో పాటు ఆయన కుటుంబసభ్యులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై స్పందించిన షమి.. తానంటే గిట్టని వారు ఇదంతా చేస్తున్నారని, ఈ ఆరోపణలన్ని అవాస్తవాలని కొట్టి పారేశాడు. 2014 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న షమి, హసిన్ దంపతులకు ఒక పాప కూడా ఉంది.