సీబీఐ చెరలో గీతాంజలి వైస్‌ ప్రెసిడెంట్‌..!

SMTV Desk 2018-03-06 14:15:46  panjab national bank, CBI, geethanjali groups vice president, vipul chitalia.

న్యూఢిల్లీ, మార్చి 6 : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో సీబీఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇదివరకే పీఎన్‌బీలో రూ.12,700కోట్ల భారీ మోసంలో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా గీతాంజలి గ్రూప్‌లో బ్యాంకింగ్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విపుల్‌ చితాలియాను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ కుంభకోణంపై అతడిని ప్రశ్నించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఉన్నత స్థానాల్లో పనిచేసిన పలువురు ఉద్యోగులను సీబీఐ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఇదిలా ఉండగా తమ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి జీతాలు చెల్లించలేమని, వేరే ఉద్యోగాలు చూసుకోవలసి౦దిగా నీరవ్ వెల్లడించిన విషయం తెలిసిందే.