హైదరాబాద్, ఫిబ్రవరి 27 : భారతీయ జనతా పార్టీ దేశానికి పట్టిపీడిస్తున్న పెద్ద రోగం అయితే కాంగ్రెస్ జలుబు, దగ్గు లాంటిదని విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, కానీ ‘జస్ట్ ఆస్కింగ్’ ద్వారా దేశ వ్యాప్తంగా చైతన్యం తీసుకురావడమే ధ్యేయమని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇదివరకే మోడీని నా కన్నా గొప్పనటుడని ప్రకాష్ రాజ్ అన్నారు.