ఆధార్ గడువు పెంపునకు సుప్రీం నో..

SMTV Desk 2018-02-25 12:40:18  supreme court, aadhar link, pitetion, deepak mishra

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఆధార్‌ అనుసంధానం గడువు మార్చి 31తో ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి గడువు పెంచాలని సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ఈ వ్యాజ్యంను సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. గడువులోపు అన్ని సేవలకు ఆధార్‌ అనుసంధానం సాధ్యం కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించింది.