మరో రికార్డు ముంగిట కోహ్లి, ధోని..

SMTV Desk 2018-02-24 14:39:52  dhoni, kohli, another record, cape town,

కేప్ టౌన్, ఫిబ్రవరి 24 : రికార్డుల రారాజు, భారత్ జట్టు సారథి విరాట్ కోహ్లి మరో రికార్డు కు చేరువలో ఉన్నాడు. సఫారీ పర్యటనలో చెలరేగిపోతున్న ఈ పరుగుల వీరుడు మరో 17 పరుగులు చేస్తే టీ-20 ల్లో 2000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత క్రికెటర్ గా నిలుస్తాడు. ప్రస్తుత విరాట్ దూకుడు చూస్తే ఆ రికార్డు అంతా కష్టమేమి కాదని క్రీడాపండితులు అభిప్రాయపడుతున్నారు. టీ20ల్లో ఇంతావరకు ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల మాత్రమే 2 వేల పరుగులు క్లబ్ లో ఉన్నారు. తొలి స్థానంలో 2271 పరుగులతో మార్టిన్ గుప్తిల్, ద్వితీయ స్థానంలో 2140 పరుగులతో బ్రెండన్ మెక్‌కల్లమ్ ఉన్నాడు. వీరిద్దరూ న్యూజిలాండ్‌కు చెందిన వారు కావడం గమనార్హం. మరో వైపు ఝార్ఖండ్ డైనమైట్‌ ధోని కూడా అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో ధోని ఇప్పటి వరకు 49 క్యాచ్‌లను అందుకున్నాడు. కేప్‌టౌన్‌ వేదికగా జరిగే టీ20లో మరో క్యాచ్‌ అందుకుంటే 50 క్యాచ్‌లు అందుకున్న మొదటి వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టిస్తాడు.