ఐపీఎల్ మ్యాచ్ సమయాల్లో మార్పుల్లేవ్..

SMTV Desk 2018-02-15 11:08:33  ipl-11, season, timings, chennai super kings, mumbai indians

ముంబయి, ఫిబ్రవరి 15 : ఐపీఎల్ మ్యాచ్ వేళలో ఎటువంటి మార్పు లేదు. ఎప్పటిలానే సాయంత్రం 4, రాత్రి 8 గంటలకు మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. తొలి మ్యాచ్‌ ఏప్రిల్‌ 7న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, నిషేధం తర్వాత బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరగనుంది. ఐపీఎల్‌లో తొలి, తుది మ్యాచ్‌లకు ముంబయిలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఫైనల్‌ మే 27న ఉంటుంది. సంబంధించి గతంలో బీసీసీఐ మ్యాచ్‌ల సమయాల్లో మార్పులు చేయాలనీ అనుకున్న ఫ్రాంచైజీలు తిరస్కరించడంతో పాత సమయాలనే బీసీసీఐ వెల్లడించింది.