ఇండియన్ ఓపెన్ ఫైనల్లో తెలుగు తేజం..

SMTV Desk 2018-02-04 12:26:27  p.v. sindhu, indian open super title, final,Ratchanok Intanon

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 : భారత తెలుగు తేజం, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఇండియా ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ ఏడాదిలో తొలి టైటిల్‌ నెగ్గడానికి అడుగు దూరంలో నిలిచింది. శనివారం సెమీస్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ సింధు, మూడో ర్యాంకర్‌ ఇంతానన్‌ రచనోక్‌ (థాయిలాండ్‌)పై గెలుపొందింది. ఆదివారం జరిగే ఫైనల్లో సింధు.. 11వ ర్యాంకర్‌ బీవెన్‌ జంగ్‌ (అమెరికా)తో తలపడనుంది. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా (భారత్‌) జంట, క్రిస్టియాన్సన్‌–క్రిస్టినా (డెన్మార్క్‌) జోడీ చేతిలో ఓటమిపాలైంది.