అందరి ఆకాంక్షలకు అనుగుణంగానే బడ్జెట్ : మోదీ

SMTV Desk 2018-01-29 11:31:05  budjet session 2018, parliament, prime minister modi.

న్యూఢిల్లీ, జనవరి 29 : భారత్ ఆర్థిక సర్వేలో లోక్ సభ, రాజ్యసభ రెండింటిలోనూ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2018 బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌కు చేరుకున్న మోదీ మీడియాతో మాట్లాడారు. "ఈ బడ్జెట్ సమావేశాలు చాలా ముఖ్యమైనవి. బడ్జెట్ ప్రతి ఒక్కరి ఆకాంక్షలకు అనుగుణంగానే ఉంటుంది. అటు శ్రామికులకు, రైతులకు.. దళిత గిరిజన వర్గాలతో పాటు ప్రతి ఒక్కరికి అనుకూలంగానే ఈ బడ్జెట్ సమావేశ౦ ఉంటుంది. ప్రపంచ దేశాలు సైతం భారతదేశంపై సానుకూలంగానే ఉన్నాయి" అని వెల్లడించారు.