ముఖ్యమంత్రి X లెఫ్టినెంట్‌ గవర్నర్‌..

SMTV Desk 2018-01-25 14:52:59  V. Narayanasamy, Puducherry, Lt. Governor, chief minister

పుదుచ్చేరి, జనవరి 25 : కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మల్లీ రాజకీయ రగడ రాజుకున్నట్లు కన్పిస్తుంది. ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈ సారి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ వ్యవహార శైలిపై రాష్ట్రపతి, ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరం పాటు అధికార కాంగ్రెస్ పార్టీకి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీకి మధ్య విమర్శల పర్వం కొనసాగింది. ఇటీవల సీఎం నూతన సంవత్సరం సందర్భంగా కొంత మారినట్లు కన్పించారు. కానీ దాదాపు నెల తర్వాత కిరణ్‌బేడీ మంగళవారం అధికారులతో నేరుగా సమావేశమయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం..నేరుగా విమర్శలు మాని కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్లడానికి నిర్ణయించుకుంది. దీంతో ఈ రచ్చ కేంద్రం వరకు చేరితే పరిస్థితులు ఎలా మారుతాయో అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.