లారీ, జీపు ఢీకొని 8 మంది మృతి..

SMTV Desk 2018-01-21 15:22:31  lorry accident, in ranchi, 8 members passed away

రాంచి, జనవరి 21 : లారీ, జీపు ఢీకొని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో చోటు చేసుకుంది. వీరంతా ఎస్ఎస్సీ పరీక్ష రాసేందుకు దుమ్కా నుండి డియోగారిన్‌ వెళ్తు౦డగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.