న్యూఢిల్లీ, జనవరి 20 : వృద్ధులకు, ఎనిమిదేళ్ల లోపు చిన్నారులకు పాస్ పోర్టు పొందేందుకు ప్రస్తుతం ఉన్న ఛార్జీలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. పుదుచ్చేరీ కరైకల్ పోస్టాఫీసులో పాస్పోర్టు సర్వీసు కేంద్రాన్ని(పీవోపీఎస్కే) మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "పాస్పోర్టు పొందేందుకు ప్రస్తుతం ఉన్న పద్ధతిని మరింత సులభతరం చేయాలని చూస్తున్నాం. చిన్నారులు, వృద్ధులకు పాస్పోర్టు పొందేందుకు ప్రస్తుతం ఉన్న ఛార్జీలో 10శాతం రాయితీ కల్పించనున్నాం. పీవోపీఎస్కే కేంద్రం ద్వారా పొరుగున ఉన్న జిల్లాలు, రాష్ట్రాలు ఈ సేవలు పొందుతాయి" అని సుష్మా స్వరాజ్ వెల్లడించారు.