న్యూఢిల్లీ, జనవరి 19 : ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల సంఘం పెద్ద షాకిచ్చింది. 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఈసీ రాష్ట్రపతి రామ్నాథ్ను కోరింది. ఆ ఎమ్మెల్యేల౦తా లాభదాయకమైన పదవులలో ఉన్నారంటూ ఆరోపిస్తూ ఈ మేరకు ఈసీ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు ఉండగా, అందులో కేజ్రీ పార్టీకి 67 సీట్లు ఉన్నాయి. కాగా ఎప్పటినుంచో కాంగ్రెస్తో పాటు బీజేపీ పార్టీలు ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 2015వ సంవత్సరంలో ఆప్ పార్టీ ఘన విజయం సాధించి౦ది. అనంతరం 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ విషయంపై ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామంటూ ఆప్ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.