న్యూఢిల్లీ, జనవరి 8 : ఐపీఎల్ కు మరోసారి దక్షిణాఫ్రికా ఆతిధ్యం ఇవ్వనుందా..? ఏంటి షాక్ అవుతున్నారా..? ఈ సీజన్ కాదు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్-12 టోర్నీ మరోసారి దేశం బయట నిర్వహించేందుకు నిర్వాహకులు కసరత్తులు చేస్తున్నారు. 2019 ఐపీఎల్ సీజన్ను దక్షిణాఫ్రికాలో నిర్వహించేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కారణమేంటో తెలుసా.. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న కారణంగా ఐపీఎల్-12వ సీజన్ను దక్షిణాఫ్రికాలో నిర్వహించాలని బోర్డు నిర్వాహకులు యోచిస్తున్నారు. ఇందుకు సఫారీ బోర్డుతో అధికారులు చర్చలు జరపగా సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. ఇంతకముందు 2009లో ఎన్నికల కారణంగా ఐపీఎల్-3వ సీజన్కు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చింది.