న్యూఢిల్లీ, జనవరి 8 : దేశరాజధానిలో ఉన్న రాష్ట్రపతిభవన్ ను తిలకించేందుకు అందరు ఆహ్వానితులేనని, సాక్షాత్ రాష్ట్రపతే పర్యాటకులను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్, ట్విటర్లో పోస్టులు చేసి, భారత గణతంత్రానికి నిదర్శనమైన ఈ నిలయం, ప్రతి ఒక్క భారతీయుడిది. రాష్ట్రపతిభవన్ను సందర్శించాలని ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నా. విచ్చేయండి, సందర్శించడని అంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సామాజిక మాధ్యమాల్లో తెలిపారు. అంతేకాకుండా, అందరినీ ఆకట్టకునేలా చేసే 43 సెకండ్ల పాటు ఉన్న రాష్ట్రపతి భవన్ వీడియోను షేర్ ఆయన చేశారు.