బెంగుళూరు, జనవరి 8: కర్ణాటక రాజధాని బెంగుళూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన కలసిపాళ్య ప్రాంతంలోని కైలాశ్ బార్ అండ్ రెస్టారెంట్లో జరిగింది. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఉన్నటు౦డి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దాంతో అక్కడ పని చేస్తున్న ఐదుగురు ఉద్యోగులు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే ఆస్థి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లింది. ఇంకా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.