న్యూఢిల్లీ, జనవరి 01 : పార్లమెంటరీ స్థాయీసంఘం ఏకీకృత సెట్టాప్ బాక్స్ను తీసుకురావాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. ఫోన్ నెంబర్ మార్చకుండా నెట్ వర్క్ మారే మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ (ఎమ్ఎన్పీ) విధానంలో ఇది ఉండబోతుందని సమాచారం. ఈ సౌకర్యం అమలులోకి వస్తే కేబుల్ వినియోగదారులూ తమకు నచ్చిన సర్వీస్కు మారే అవకాశం ఉంటుంది. దీంతో పోటీ పెరిగి వినియోగదారుడికి తక్కువ ధరకే నాణ్యమైన సేవలు లభిస్తాయని పార్లమెంటరీ స్థాయి సంఘం తెలిపింది.