న్యూఢిల్లీ, డిసెంబర్ 30 : సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కాలి గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధావన్ మొదటి టెస్ట్ కు దూరం అయ్యాడు. కేప్టౌన్లో జనవరి 5న జరగబోయే తొలి టెస్టుకు ధావన్ను దూరంగా ఉంచుతున్నట్లు భారత క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ సభ్యులు తెలిపారు. గాయం నుండి గబ్బర్ కోలుకున్నప్పటికీ తర్వాత జరగబోయే మ్యాచ్ ల దృష్ట్యా విశ్రాంతి ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఓపెనర్లుగా కేఎల్ రాహుల్-మురళీ విజయ్ భారత్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు.