చెన్నై, డిసెంబర్ 29 : తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కొత్త పార్టీ పై ఈ నెల 31 న ప్రకటన చేస్తారని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇటీవల సమావేశంలో ఓ అభిమాని రజినీ కాంత్ కాళ్లపై పడిన విషయంపై సూపర్ స్టార్ స్పందిస్తూ.. “అభిమానులు నా కాళ్లపై పడవద్దు. భగవంతుడు, మనకు జన్మించిన తల్లిదండ్రులు కాళ్లపై మాత్రమే మోకరిల్లాలి. ప్రాణమిచ్చినవాడు దేవుడు, శరీరాన్నిచ్చినవారు అమ్మానాన్న. వారి తరువాత పెద్దల కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు పొందవచ్చు. అంతేగానీ, డబ్బు, పదవులు, పేరు, అధికారం ఉన్నవారి కాళ్లపై పడాల్సిన అవసరం లేదు” అని వ్యాఖ్యానించారు.