న్యూ ఢిల్లీ, డిసెంబర్ 29: నేటి సమాజంలో పిల్లలను పక్కింటికి కూడా పంపించేందుకు సంశయింపజేసే ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. నగరంలోని పాలం ప్రాంతానికి చెందిన 60 ఏళ్ళ వృద్ధుడు పక్కింటికి చెందిన తొమ్మిది,ఐదు సంవత్సరాల చిన్నారులను మిఠాయిలు ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వృద్ధుడి వికృత చేష్టలకు భయపడిన చిన్నారులు ఏడిస్తే రూ.5 చేతిలో పెట్టి ఎవ్వరికీ చెప్పదంటూ పంపించేశాడు. ఈ సంఘటన ఆదివారం జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారుల తల్లిదండ్రులకు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.