రియాద్, డిసెంబర్ 28 : ప్రపంచ మాజీ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్లసన్ పై భారత్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ప్రతీకారం తీర్చుకున్నాడు. 2013 న వీరిద్దరి మధ్య ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ జరగగా నార్వే కుర్రాడు కార్లసన్ ఆనంద్ను ఓడించిన విషయం తెలిసిందే. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో అజేయంగా దూసుకెళ్తున్న ఆనంద్ తొమ్మిదో రౌండ్లో 34 ఎత్తుల్లో కార్ల్సన్ను ఓడించాడు. తొలిరోజు జరిగిన ఐదు రౌండ్లలో ఒక్కదాంట్లోనూ ఓడని ఆనంద్, వరుసగా రెండోరోజు పోరులోనూ తన విజయ యాత్ర కొనసాగిస్తున్నాడు. బుధవారం ఐదురౌండ్లలో రెండు విజయాలు, మూడు డ్రాలు నమోదుచేశాడు. దీంతో ఆనంద్ 7.5 పాయింట్లతో సంయుక్తంగా రెండోస్థానంలో ఉన్నాడు. ఫెదోసివ్ (8 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచాడు.