చెన్నై, డిసెంబర్ 28 : శశికళ మేనల్లుడు, టీటీవీ దినకరన్కు మద్దతుదారులైన 44మంది పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు. తమ పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా దినకరన్కు మద్దతిచ్చినందుకు వారి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ విధివిధానాలను వ్యతిరేకించినందుకు గాను వారిపై క్రమశిక్షణ చర్యల కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు పన్నీర్, పళని స్వామి సంయుక్తంగా ఈ ప్రకటనను జారీ చేశారు. ఇక వారికి పార్టీలోని ఏ హోదాలో కొనసాగే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.