ముంబై, డిసెంబర్ 28 : శ్రీలంకతో ఇటీవల ముగిసిన టెస్ట్, వన్డేలు, టీ-20 సిరీస్ లలో అద్భుతమైన ప్రదర్శనను చూపించి మెండైన ఆత్మవిశ్వాసంతో భారత్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరింది. ఈ ఉదయం టీమిండియా బృందం ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరారు. భారత్ జట్టు సారథి విరాట్ కోహ్లి వివాహం అనంతరం తన భార్య అనుష్క శర్మతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు పయనమయ్యాడు. ఈ పర్యటనలో కోహ్లి సేన మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ-20 సిరీస్ లు ఆడనుంది. కాగా కేప్టౌన్లో జనవరి 5వ తేదీన భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.