చెన్నై, డిసెంబర్ 28 : తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై కొనసాగుతున్న ఉత్కంతకకు మరో మూడు రోజుల్లో తెరపడనుంది. వరుసుగా రెండో రోజు సమావేశానికి వెళ్లే ముందు రజినీ మీడియాతో మాట్లాడుతూ.. "మళ్లీ మళ్లీ అంటున్నానని ఏమి అనుకోవద్దు. అమ్మ, నాన్న జీవించే దేవుళ్లు. పిల్లల్ని బాగా చదివించండి. మన ఆస్తి వారే. ఇంకా మనం చర్చించుకోవాల్సి౦ది చాలా ఉంది. నాలుగు రోజుల్లో అన్ని విషయాలు చెప్తాను" అని వెల్లడించారు.