వారు మరోసారి మా నమ్మకాన్ని నిలబెట్టారు : రోహిత్ శర్మ

SMTV Desk 2017-12-23 12:59:26  rohit sharma, chahal, kuldeep yadav, india, srilanka, 2 nd t-20

ఇండోర్, డిసెంబర్ 23 : ఇండోర్ లో జరిగిన రెండో టీ-20 మ్యాచ్ లో శ్రీలంక జట్టు పై భారత్ జట్టు 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో మూడు టీ-20 ల సిరీస్ ను రోహిత్ సేన మరో మ్యాచ్ మిగులుండగానే 2-0 తో సిరీస్ ను కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్ లో 261 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంకేయులు ఆరంభంలో ధాటిగా ఆడిన, తర్వాత భారత్ స్పిన్ జోడీ చాహల్, కులదీప్ యాదవ్ వేసిన గింగిరాలు తిరిగే బంతుల దెబ్బకు 172 పరుగులకే ఆలౌటయ్యారు. ఈ మ్యాచ్ లో చాహల్ 4 వికెట్లు, కులదీప్ 3 వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విషయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా సారధి రోహిత్ శర్మ స్పందిస్తూ.."చాహల్, కులదీప్ మరోసారి మా నమ్మకాన్ని నిలబెట్టారు. ఎంతటి ఒత్తిడిలోనైన ఇద్దరు తమ అత్యుతమ ప్రదర్శనతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా కలవారు. ఈ మ్యాచ్ లో కులదీప్ , చాహల్ సరైన సమయంలో టీంకు వికెట్లను అందించారు. ప్రస్తుతం వారిద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారు" అని తెలిపారు.