న్యూఢిల్లీ, డిసెంబర్ 18 : ఒలింపిక్ పతక విజేత, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో "స్వర్ణం" సాధించాడు. మూడేళ్ల విరామం అనంతరం భారత్ తరుపున అంతర్జాతీయ బరిలోకి దిగిన ఆయన 74కేజీ ఫ్రీస్టైల్ ఫైనల్లో న్యూజిలాండ్ కు చెందిన ఆకాష్ ఖుల్లర్ పై విజయం సాధించాడు. కాగా ఇటీవల జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రాణా వాకోవర్ ఇవ్వడంతో సుశీల్ స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే. మరోవైపు మహిళ 62 కేజీ ఫ్రీస్టైల్ ఫైనల్లో ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ సత్తా చాటింది. 13-2తో న్యూజిలాండ్ క్రీడాకారిణి తయ్లా తౌహిన్ పై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ 29 స్వర్ణాలు, 24 రజతాలు, 6 కాంస్య పతకాలు సాధించింది.