విశాఖ, డిసెంబర్ 17 : భారత్-శ్రీలంక ల మధ్య జరుగుతున్న తుది పోరులో ప్రారంభంలోనే చుక్కెదురైంది. రెండో వన్డేలో అద్భుత ద్వి శతకం సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. నిర్ణయాత్మక ఫైనల్ మ్యాచ్ లో స్వల్ప స్కోర్ కే పెవిలియన్ కు చేరారు. ఈ మ్యాచ్ లో పద్నాలుగు బంతులు ఎదుర్కొన్న రోహిత్, కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అఖిల ధనుంజయ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 6 ఓవర్లు ముగిసే సరికి 26/1 గా ఉంది. క్రీజులో శిఖర్ ధావన్(11), శ్రేయస్ అయ్యర్(1) ఉన్నారు.