రాజ్యసభలో గందరగోళం...

SMTV Desk 2017-12-15 12:30:57  PARLIAMENT WINTER SESSIONS, RAJYASABHA, VENKAYA NAIDU.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15 : రాజ్యసభ నుండి జేడీయూ నేతలు శరద్ యాదవ్, అలీ అన్వర్‌లపై ఇటీవల అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా.. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆ ఇద్దరు నేతల అనర్హత విషయం సభ్యులకు వెల్లడించారు. దీంతో రాజ్యసభలో గందరగోళ వాతావరణం నెలకొ౦ది. ఇదిలా ఉండగా ఆసియా ప్రపంచ కప్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరచిన మహిళల హాకీ టీమ్‌కు వెంకయ్య అభినందనలు తెలియజేశారు.