న్యూఢిల్లీ, డిసెంబర్ 14 : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ.. ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపించింది. ఈ మేరకు కేంద్రం నేడు అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశం అనంతరం లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ అన్ని పార్టీ నేతలకు ఈరోజు విందు ఇవ్వనున్నారు. ఈ శీతాకాల సమావేశాలు మొత్తం 14 పని దినాలతో జనవరి 5 వ తేదీ వరకు కొనసాగనున్నాయి.