బిహార్ లో నోట్ల తిప్పలు.. నిలిచిపోయిన పెద్ద నోట్లు...

SMTV Desk 2017-12-12 18:33:16  bihar, money shortage issue, sbi atms, sbi chief manager sayyad mujafar.

పట్నా, డిసెంబర్ 12 : బిహార్‌ రాజధాని పట్నాలోని పలు ఏటీఎంలకు పెద్ద నోట్ల సరఫరా నిలిచిపోయింది. ఏకంగా ఆర్‌బీఐ నుండే ఈ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎస్‌బీఐ కి చెందిన దాదాపు 300 ఏటీఎంలలో పెద్ద నోట్ల సరఫరా ఆగిపోయింది. దీంతో ఆర్‌బీఐతో ఈ విషయంపై మాట్లాడాలని భావిస్తున్నట్లు ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ సయ్యద్‌ ముజఫర్‌ వెల్లడించారు. ఈ విషయంపై ప్రజలు స్పందిస్తూ.. ఆర్‌బీఐ మరోసారి ఈ పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ఉంద౦టూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.