కోల్కతా, డిసెంబర్ 12: శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడిపోయిన భారత్ కు మాజీ సారథి సౌరవ్ గంగూలీ దన్నుగా నిలిచాడు. ప్రస్తుతం టీంమిండియా జట్టులో ఉండే బ్యాట్స్మెన్ సత్తా ఏంటో మనకు తెలుసని, కానీ భారత్ ఆడుతుందా లేదా అన్నదే ఆందోళన కలిగిస్తోందని గంగూలీ అన్నారు. పేస్, స్వింగ్ను చక్కగా ఆడగల అజింక్య రహానెను మూడో స్థానంలో ధర్మశాలలో ఆడించాలని కోరారు.