న్యూఢిల్లీ, డిసెంబర్ 11 : కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్గాంధీ ఏకగ్రీవ౦గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు రాహుల్ కాకుండా మరెవరు నామినేషన్ వేయకపోవడం, ఈ రోజుతో నామినేషన్ గడువు ముగియడంతో ఆయనను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ రామచంద్రన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ నెల 16 వ తేదీన బాధ్యతలను స్వీకరించనున్నారు. అదే విధంగా సోనియాగాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతల సమక్షంలో ధ్రువపత్రాన్ని అందించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని తమ పార్టీ కార్యాలయంలో టపాసులను పేల్చి సంబరాలు చేసుకున్నారు.