ధర్మశాల, డిసెంబర్ 9: ధర్మశాల వేదికగా రేపటి నుంచి భారత్-శ్రీలంకల మధ్య మూడు వన్డేల సిరీస్ అరంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి ప్రాంతమంతా దట్టమైన పొగ మంచు ఏర్పడే అవకాశం ఉందని, వరుసగా నాలుగు రోజులు వర్షం ముప్పు కూడా ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. దీనిపై హిమాచల్ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్పందించి.. ఆటకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని తెలిపింది. రేపు (ఆదివారం) ఉదయం 11.30గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కి భారత్ సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మ అందుకున్నాడు.