న్యూఢిల్లీ, డిసెంబర్ 06 : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న రాహుల్ గాంధీకి రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నేత టి.సుబ్బరామిరెడ్డి అభినందనలు తెలియజేశారు. రాహుల్ ఆధ్వర్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సుబ్బరామిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా రాహుల్ తరఫున దాదాపు 80కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ అధ్యక్ష పదవికి రాహుల్ ఒక్కరే నామినేషన్ వేయడంతో అధ్యక్షుడిగా ఆయన పేరును ఖరారు చేయడమే మిగిలి వుంది. రాహుల్ కి అభినందనలు తెలియజేసిన వారిలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, సుశీల్కుమార్ షిండే, ఆనంద్ శర్మ ఉన్నారు.