న్యూఢిల్లీ, నవంబర్ 23 : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు భారత్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ముంబై మారణ హోమనికి ప్రధాన కారకుడు, ఉగ్ర సంస్థ జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ను విడుదల చేస్తూ పాక్ కోర్టు తీర్పు వెల్లడించిన తర్వాతి రోజే భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం పాక్ కు మింగుడుపడని విషయం. వచ్చే సంవత్సరం ఇండియాలో జరిగే ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో పాకిస్తాన్ ఆడేందుకు భారత్ నిరాకరించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశం కంటే క్రికెట్ గొప్పది కాదని, దేశం తర్వాతే ఏదైనా అని తేల్చి చెప్పారు. దీంతో ఆసియా కప్ ఎక్కడ నిర్వహిస్తారన్నదానిపై సందిగ్ధత నెలకొంది.