న్యూఢిల్లీ, నవంబర్ 13 : ప్రస్తుతం ఏ ఆసుపత్రి కి వెళ్లాలన్న ఔట్ పేషెంట్ విభాగంలో టోకెన్ తీసుకోవాలి. రద్దీ హాస్పిటల్ లలో అయితే ఓపీ విభాగంలో క్యూ లో నిలబడి ప్రయాసపడక తప్పదు. ఇక విదేశాల నుండి వచ్చిదేశ రాజధానిలో వైద్యం చేసుకున్న రోగుల బాధ వర్ణనాతీతం...ఇక ఒక సారి వైద్యం చేసుకున్న భాదితులు మరల ఢిల్లీ రానక్కరలేదు. వీరి కోసం ప్రత్యేకంగా రాజధానిలోగల గంగారామ్ హాస్పిటల్ లోని వైద్యులు " మై ఫాలో అప్" పేరిట మొబైల్ యాప్ ను విడుదల చేశారు. ఈ యాప్ లో రోగులు తమ వైద్య పరీక్షల రిపోర్ట్ ను అప్ లోడ్ చేసి కొంత రుసుముతో సంబంధిత వైద్య సలహాలు తీసుకోవచ్చు. తాము చాలా మంది రోగులకు శస్త్రచికిత్సలు చేశామని, వారు తర్వాత సలహాల కోసం మా వద్దకు రానవసరం లేదని, యాప్ ద్వారా సంప్రదిస్తే చాలని డాక్టర్ సుధీర్ కల్హన్ తెలిపారు.