న్యూఢిల్లీ, నవంబర్ 03 : ప్రస్తుతం ఆధార్ అన్నింటికీ ఆధారంగా మారింది. ఈ క్రమంలో చరవాణిల వినియోగాదారులు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 6 లోగా తమ మొబైల్ నెంబర్లును ఆధార్తో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. కొత్త బ్యాంక్ ఖాతా తెరవాలంటే ఆధార్ తప్పనిసరి అని పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నా కేంద్రం మాత్రం మొబైల్తో ఆధార్ అనుసంధానం గడువును మార్చేది లేదని స్పష్టం చేసింది. బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం కోసం ఈ తేదీని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించాలని నిర్ణయించింది.