పూణే, అక్టోబర్ 26 : వన్డే సిరీస్ చేజారిపోకుండా కోహ్లీ సేన కీలక మ్యాచ్ లో సత్తా చాటింది. బుధవారం పూణేలో కివీస్ తో జరిగిన రెండో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడు వన్డేల సీరీస్ ను 1-1 తో సమం చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 230 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది . దినేష్ కార్తీక్ (64), శిఖర్ ధావన్(68)లు హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సిరీస్ ఫలితం తేల్చే చివరి వన్డే కాన్పూర్ లో జరగనుంది.