పూణే, అక్టోబర్ 25 : భారత్-న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్నా రెండో వన్డేలో మొదట టాస్ గెలిచినా కివీస్ బ్యాటింగ్ ఎంచుకొంది. నిర్ణీత ఓవర్లాడిన కివీస్ 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ముంబయిలో వన్డే విజయంలో కీలకపాత్ర పోషించిన టేలర్, లేథమ్ ఈ వన్డేలో రాణించలేకపోయారు. భారత్ బౌలర్లు ఈ సారి ప్రత్యర్ధిని తమ బౌలింగ్ తో బోల్తా కొట్టించారు. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, బుమ్రా, చాహల్కు రెండేసి, పాండ్య, అక్షర్ పటేల్కు తలో వికెట్ దక్కాయి.