న్యూఢిల్లీ, అక్టోబర్ 20 : ఇండియన్ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి తన రాజీనామా పత్రాలను న్యాయశాఖకు అందజేశారు. కుటుంబ కారణాలు వల్ల తాను రాజీనామా చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యపరమైన ఇబ్బందులపై కూడా దృష్టిసారించ లేకపోయానని, ఇప్పటి నుండి తగిన సమయం కుటుంబం కోసం కేటాయించాలనే తలంపుతోనే తాను రాజీనామా చేస్తున్నట్టు రంజిత్ కుమార్ మీడియాకు తెలిపారు. 2014లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముకుల్ రోహత్గి స్థానంలో సొలిసిటర్ జనరల్గా రంజిత్ కుమార్ను నియమించింది. ఈ ఏడాది జూన్లో ఆయన పదవి కాలాన్ని మరో మారు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.