తిరువనంతపురం, సెప్టెంబర్ 13: భారత ప్రదాని నరేంద్ర మోదీ ఇండియాను డిజిటలైజేషన్ చెయ్యాలని కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు సహకరిస్తూనే ఉన్నాయి. ఈ ప్రక్రియలో తమిళనాడు ప్రభుత్వం గత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులను ప్రజలకు అందించేందుకు రంగం సిద్దం చేసింది. పంపిణికి సిద్దమైన కార్డులను లబ్దిదారులకు అందజేసారు. కానీ ఓ మహిళకు జారీ చేసిన కార్డు పైన ఆమెకు బదులు హీరొయిన్ కాజల్ ఫోటో ప్రింట్ అయ్యింది అది చూసిన ఆమె ఆశ్చర్య పోయింది. దీంతో ఆ మహిళ, అధికారులను కలిసి సిబ్బంది పనితనాన్ని వివరించింది. ఆ ఒక్క కార్డులోనే కాకుండా చాలా మంది లబ్ధిదారుల కార్డుల్లోనూ, నటులతో పాటు పలు వస్తువుల ఫొటోలు కూడా వచ్చాయని అధికారులు గుర్తించారు. ఈ విషయంపై విపక్షాలు విరుచుకు పడుతున్నాయి