ఢిల్లీ బస్సుల్లో ఇవాళ్టి నుంచి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు

SMTV Desk 2019-10-29 17:07:06  

ఢిల్లీ బస్సుల్లో ఇవాళ్టి నుంచి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఉచిత ప్రయాణంపై మహిళలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఎన్నికల్లో లబ్ది కోసమే కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.